మానవునిలో జీర్ణవ్యవస్థ

ఆహారంలో శోషణ చెందని సంక్షిప్త అణువులు రక్తంలో శోషణ చెంది, సరళ అణువులుగా మారుతాయి. ఈ ప్రక్రియనే జీర్ణక్రియ అంటారు. దీనికోసం శరీరంలో ప్రత్యేక జీర్ణవ్యవస్థ ఉంటుంది. జీర్ణవ్యవస్థలో జీర్ణనాళం, అనేక అనుబంధ జీర్ణ గ్రంథులు ఉంటాయి. జీర్ణ గ్రంథుల నుంచి విడుదలయ్యే జీర్ణ రసాల్లోని ఎంజైములు, రసాయనిక చర్యల ద్వారా జీర్ణక్రియను నిర్వహిస్తాయి.

నోటి కుహరంలో దంతాలతో నమలడం వల్ల ఆహారపదార్థాలు మెత్తబడతాయి. లాలాజల గ్రంథుల నుంచి విడుదలయ్యే లాలాజలంలో టయలిన్ ఎంజైమ్ ఆహారంలోని స్టార్చ్ ను మాల్టోజ్ గా విచ్చిన్నం చేస్తుంది. నోటిలో లాలాజలంలో కలిసిన ఆహారం, ఆహార వాహిక ద్వారా జీర్ణాశయంలోకి చేరుతుంది. జీర్ణాశయం కుడ్యంలోని జఠర గ్రంథుల నుంచి విడుదలయ్యే జఠరరసంలో హైడ్రోక్లోరిక్ ఆమ్లం, పెప్సిన్ ఉంటాయి. ముందుగా క్రియారహిత రూపంలో పెప్సిన్ విడుదలవుతుంది. ఆ తర్వాత హైడ్రోక్లోరిక్ ఆమ్లం ప్రభావం ద్వారా క్రియాశీల రూపంలోకి మారుతుంది. ప్రొటీన్లను ప్రొటియో లు, పెట్రోలు అనే ఖండితాల్లోకి పెప్సిన్ విచ్ఛిన్నం చేస్తుంది. 

జీర్ణాశయంలో జఠర రసంలో ఆహారం కలిసిపోయి ఆమ్లయుతం అవుతుంది. ఆ తర్వాత ఆహారం చిన్న పేగు మొదటి భాగమైన ఆంత్రమూలంలోకి చేరుతుంది. అక్కడ కాలేయం నుంచి విడుదలయ్యే పైత్యరసం, క్లోమం నుంచి విడుదలయ్యే క్లోమరసంతో ఆహారం కలుస్తుంది. కాలేయం, లంబికల మధ్య ఉండే పిత్తాశయంలో పైత్యరసం నిల్వ ఉండి, ఆ తర్వాత ఆంత్రమూలంలోకి విడుదలవుతుంది. పైత్యరసంలో పైత్యరసం లవణాలు, వర్ణకాలు ఉంటాయి. ఎంజైమ్లు ఉండవు. సోడియం, పొటాషియం టారోకొలేట్లు, గ్లైకోకొలేట్లు ఈ మూడూ పైత్యరస లవణాలు. కొవ్వుల ఎమర్జెనను పైత్యరస లవణాలు తయారుచేస్తాయి. బైలిరూబిన్, బైలివర్జిన్లు పైత్యరస వర్ణకాలు. ఇవి వ్యర్థాలు. ఇవి చివరకు మల పదార్థం ద్వారా విసర్జితమవుతాయి. క్లోమరసం రెండు దశల్లో విడుదలవుతుంది. మొదటి దశలో విడుదలైన క్లోమరసంలో బైకార్బొనేట్ ఎక్కువగా ఉంటుంది. ఈ రసంలో కలిసిన తర్వాత ఆహారం క్షారయుతమవుతుంది. ఆ తర్వాత రెండో దశలో ఎంజైమ్లు అధికంగా ఉన్న క్లోమరసం విడుదలవుతుంది. క్లోమరసంలోని ఎంజైమ్ లు ఆంత్రమూలంలో జీర్ణక్రియను నిర్వహిస్తాయి. నోటి కుహరంలో జీర్ణం కాకుండా మిగిలిన స్టారు అమిలాప్సిన్ మాల్టోజ్ గా విచ్ఛిన్నం చేసుత &ంది. జీర్ణాశయంలోని పెప్టాన్లు, ప్రొటియోజీలను- ట్రిప్సిన్, కైమోట్రిప్సిన్ అనే ఎంజైమ్లు పెప్టైలుగా విచ్ఛిన్నం చేస్తాయి. ఆహారంలోని కొవ్వులను స్టియాప్సిన్ ఎంజైమ్ ట్రైగ్లిజరైడ్లుగా విచ్ఛిన్నం చేస్తుంది. క్లోమరసం, పైత్యరసంతో కలిసి క్షారయుతంగా మారిన ఆహారం కైల్.

చిన్న పేగులోని రెండో భాగం జెజునంలో జీర్ణక్రియ పూర్తవుతుంది. జెజునం కుడ్యంలోని ఆంత్ర గ్రంథులు, ఆంత్రరసాన్ని విడుదల చేస్తాయి. ఆంత్రరసంలోని ఎంజైమ్లు జీర్ణ క్రియను పూర్తిచేస్తాయి. ఎంజైమ్ చర్య ద్వారా మాల్టేట్-మాల్టోజ్, రెండు గ్లూకోజ్ అణువులుగా విచ్ఛిన్నం చెందుతుంది. అదే విధంగా ఇన్వర్టేజ్ ఎంజైమ్ ద్వారా సుక్రోజ్ ఒక గ్లూకోజ్, ఒక ఫ్రక్టోజ్ గా విచ్ఛిన్నం చెందుతుంది. లాక్టేజ్ ఎంజైమ్ చర్యద్వారా లాక్టోజ్-గ్లూకోజ్, గాలక్టోజ్ గా విచ్ఛిన్నం చెందుతుంది. పెప్పై లన్నీ ఎరిప్సిన్ వంటి ఎంజైమ్ ద్వారా అమైనో ఆమ్లాలుగా విచ్ఛిన్నం చెందుతాయి. ట్రైగ్లిసరైడ్లు చివరకు ఫాటి ఆమ్లాలు, గ్లిసరాల్ గా విచ్ఛిన్నమవుతాయి.

చిన్న పేగులోని మూడో భాగం ఇలియం. ఇక్కడ జీర్ణమైన ఆహారం సరళ అణువులుగా రక్తంలోకి శోషణ చెందుతుంది. రక్తంలోకి శోషణ చెందిన ఆహారం శరీర చర్యలకు, పెరుగుదలకు ఉపయోగపడటం సాంగ్వీకరణం. జీర్ణంకాని వ్యర్థం పెద్ద పేగులోకి చేరి అధిక నీరు శోషణ చెందడం ద్వారా మలంగా మారుతుంది. పురీషనాళం చివరిలో ఉన్న పాయువు నుంచి మలం విసర్జితమవుతుంది.

జీర్ణవ్యవస్థలోని కీలక చర్యలను హార్మోన్లు నియంత్రిస్తాయి. జఠర గ్రంథుల నుంచి జఠర రసం విడుదలను గ్యాస్ట్రిన్ ప్రేరేపిస్తుంది. పిత్తాశయం నుంచి పైత్యరసం విడుదలను కొలిసెస్టో కైనిన్ ప్రేరేపిస్తుంది. అదేవిధంగా క్లోమం నుంచి క్లోమరసం విడుదలను సెక్రిటిన్, ప్యాంక్రియోజామిన్ ప్రేరేపిస్తాయి.


 RELATED TOPICS 

విటమిన్లు 

మొక్కల వర్గీకరణ

జంతువుల వర్గీకరణ

రక్తకణాలు

రక్త వర్గాలు, ప్రసరణ

కిరణజన్య సంయోగక్రియ

మానవ వ్యాధులు