• సింగిడి తెలంగాణ రచయితల సంఘం ఆధ్వర్యంలో “దిమ్మస” అనే కవితా సంకలనం వెలువరించబడింది.
  • వేముగంటి మురళీకృష్ణ సంపాదకత్వంలో తెలంగాణ జాతిపిత ఆచార్య జయశంకర్ స్మృతి కవితా సంకలనం "జయశిఖరం” వెలువడింది.
  • 2002లో జూలూరి గౌరీశంకర్ “పొక్కిలి" కవితా సంకలనం వెలువరించారు.
  • ముండ్లగర్ర - జూలూరి గౌరీశంకర్
  • నది పుట్టువడి, ఇక్కడి చెట్లగాలి - నందిని సిద్ధారెడ్డి
  • చెట్టును దాటుకుంటూ - జూకంటి జగన్నాథం
  • పొద్దు పొడుపు, పొక్కిలివాళ్ళ పులికింత - అన్నవరం దేవేందర్ 
  • జఖి ఆవాజ్ - స్కైబాబ
పాటలు
  • డా॥ జయధీర తిరుమల రావు సంపాదకత్వంలో వెలువడిన 101 పాటల సంకలనం “ఒక్కొక్క పాటేసి”
  • గద్దర్ : అమ్మా తెలంగాణమా ఆకలి కేకల గానమా, పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలమా
  • గూడ అంజయ్య : అయ్యోనివా నువ్వు అయ్యోనివా
  • అందెశ్రీ : జయజయహే తెలంగాణ, జై బోలో తెలంగాణ, బొమ్మ చెక్కితే బొమ్మ, మాయమైపోతున్నాడమ్మ మనిషన్న వాడు
  • నందిని సిద్ధారెడ్డి : నాగేటి సాల్లళ్ళ నా తెలంగాణ
  • గోరటి వెంకన్న : పల్లె కన్నీరు పెడుతుందో, ఇద్దరం విడిపోతే భూమి బద్దలవుతుందా
  • దరువు ఎల్లన్న : వీరులారా వందనం
  • మిత్ర : చినుకు చినునకు కురిసన నేల చిత్రమైన వాసన, ఆడుదాం డప్పుల్లా దరువు, ఎందుకు రాలి పోతావురా నువ్వు
  • డా॥పసునూరి రవీందర్ : జై కొట్టు తెలంగాణ
  • అభినయ శ్రీనివాస్ : ఉస్మానియా క్యాంపస్లో ఉదయించిన కిరణమా
  • “తెలంగాణ కవుల గర్జన" సభ 2011, ఫిబ్రవరి 27వ తేదీన హైదరాబాద్ (బషీర్బగాలోని ప్రెస్లబ్)లో జూలూరి గౌరీశంకర్ అధ్యక్షతన తెలంగాణ సింగిడి రచయితల సంఘం, తెలంగాణ రచయితల వేదిక సంయుక్త ఆధ్వర్యంలో జరిగింది.
  • “విరుగుడు” వ్యాస సంకలనాన్ని తెలంగాణ రచయితల వేదిక 13 ఏప్రిల్, 2011న ట్యాంక్ బండ్ పై పోతన విగ్రహం వద్ద ఆవిష్కరించబడింది.
  • “మంజీర రచయితల సంఘం" రజతోత్సవ సభలు 23 జూలై 2011న సిద్ధిపేటలో జరిగాయి.
  • మిద్దెరాములు - ఒగ్గుకథ
  • చిందు ఎల్లమ్మ - చిందు యక్షగానం
  • దర్శనం మొగులయ్య - పన్నెండు మెట్ల కిన్నేర
  • దగాపడ్డ తెలంగాణ - గాద ఇన్నయ్య
  • తల్లడిల్లుతున్న తెలంగాణ పుస్తక రచయితలు - ప్రొ॥ విశ్వేశ్వరరావు, ప్రొ॥సింహాద్రి